దుబాయ్: ఐపీఎల్ సీజన్-13లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. రైజర్స్ కు మంచి ప్రారంభం దక్కలేదు. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 26 రన్స్ మాత్రమే చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఆచితూచి ఆడుతూ వచ్చింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
హైదరాబాద్ ప్లేయర్స్ లో.. జానీ బెయిర్ స్టో(16), డేవిడ్ వార్నర్(48), మనీష్ పాండే(54), విలియమ్సన్(22 నాటౌట్), గార్గ్(15) రన్స్ చేశారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్: జోప్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, కార్తీక్ త్యాగీ తలో వికెట్ తీశారు.