కర్నూలు: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజైన శుక్రవారం నాడు స్వామి అమ్మవారికి విశేష పూజల అనంతరం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ముందుగా రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించారు. వసంతంతో నింపిన గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నం రాశి) సాత్విక బలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవారలను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపించారు. రథోత్సవ దర్శనం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. రథోత్సవాన్ని పురస్కరించుకుని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పూలతో రథాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు.
వైభవంగా శ్రీశైల మల్లన్న రథోత్సవం
- ఆంధ్రప్రదేశ్
- March 13, 2021
లేటెస్ట్
- దుబాయ్లో కుండపోత..వరదలతో జనజీవనం అస్తవ్యస్తం
- ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ..బరిలో కేంద్ర మంత్రులు 8 మంది
- సీతారాముల కల్యాణ వైభోగం
- మన ఊరు బెంగళూరు కావొద్దు
- భద్రాచలంలో కన్నుల పండువగా రాముని లగ్గం
- దండకారణ్యంలో బస్తర్ ఫైటర్స్..3 నెలల్లో 71 మంది నక్సల్స్ మృతి
- ఆదిలాబాద్లో కమలం డీలా... బీజేపీని వీడుతున్న కీలక నేతలు
- నామినేషన్ల ప్రక్రియలో అవాంతరాలు ఉండొద్దు
- మిల్లు లేని దళారీకి రూ.220 కోట్ల ధాన్యం
- కాబోయే ప్రధాని వయనాడ్ నుంచే : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- మాంసం ప్రియులకు షాక్... హైదరాబాద్ లో ఆదివారం మటన్ షాపులు బంద్
- గుడ్ న్యూస్ వేడి నుంచి ఉపశమనం : రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు...
- KKR vs RR: ఆవేశ్ ఖాన్కే ఇలాంటివి సాధ్యం.. ఒక్క బంతి ఆడకుండానే వైరల్ అయ్యాడుగా
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
- మెట్రో సిటీల్లో బతకాలంటే రూ.20 లక్షలు కావాలా..?
- IPL 2024: 11 మంది బ్యాటర్లతో బరిలోకి.. RCB గెలుపుకు మంచి ఉపాయం చెప్పిన మాజీ క్రికెటర్
- హైదరాబాద్లో రాజాసింగ్ ర్యాలీకి.. ఏర్పాట్లు ఇవే
- అంతరిక్షంలో భూమికి దగ్గరగా అతి పెద్ద బ్లాక్ హోల్: సూర్యుని కంటే 33 రెట్లు పెద్దది
- VenkyAnil3: వెంకీ సినిమాలో నటించాలనుకుంటున్నారా..ఇదిగో ఆర్టిస్టులు కోసం కాస్టింగ్ కాల్
- కల్లు అమ్మకాలను అడ్డుకున్న ఆబ్కారీ ఆఫీసర్లు