టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక! భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్    

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక! భారత జట్టులో వాషింగ్ టన్ సుందర్    

ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ పై భారీ మార్పులతో బరిలోకి దిగిన భారత్ కీలక ప్లేయర్లను ప్లేయింగ్ 11 లోకి తీసుకొచ్చింది. గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్ టన్ సుందర్ కి అవకాశం దక్కింది. మరోవైపు శ్రీలంక తుది జట్టులో గాయపడిన తీక్షణ బదులు స్పిన్నర్ హేమంత్ జట్టులోకి చేరాడు.       

భారత్ తుది జట్టు :

రోహిత్ శర్మ (కెప్టెన్) , శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా,రవీంద్ర జడేజా, వాషింగ్ టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్

శ్రీలంక తుది జట్టు :

 పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్) , సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్) , దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత, ప్రమోద్ మధుశన్, మతీషా పతిరణ