బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. తను నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘మృత్యుంజయ్’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ అప్డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లో శ్రీవిష్ణు.. పేపర్లతో నిండిన రోడ్డుపై నిలబడి ఉండటం ఆసక్తిని పెంచుతోంది. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ, కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.
27th February it is for #Mrithyunjay to win your hearts in theatres ❤️
— Sree Vishnu (@sreevishnuoffl) February 5, 2026
See you all with a thrilling tale :) pic.twitter.com/9knLFcihhw
