
ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో రచయితగా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అవసరాల శ్రీనివాస్... మూడో సినిమాగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం డైరెక్ట్ చేశాడు. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. మార్చి 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీనివాస్ ఇలా ముచ్చటించాడు.
‘‘ఇది చాలా నేచురల్గా ఉండే సినిమా. క్యారెక్టర్స్, డైలాగ్స్ కూడా అంతే సహజంగా ఉంటాయి. నిజ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా రాసుకున్నా. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అందుకే దీనికి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే టైటిల్ పెడితే బాగుంటుందనిపించింది. ‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నాగశౌర్యతో చేస్తున్న సినిమా కాబట్టి.. ఇది కూడా అలాగే ఉంటుందనుకుంటున్నారంతా. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఏడు చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. 18 నుంచి 28 ఏళ్ళ వయసులో నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్టుగా వేరియేషన్స్ చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు. శౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. మాళవిక ఎమోషనల్ సీన్స్లో అద్భుతంగా నటించింది. ముద్దు సీన్తో సహా అన్నీ ఆమెకు ముందే చెప్పాను. కథకు కనెక్ట్ అవడంతో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కళ్యాణ్ మాలిక్ గారు ‘అష్టాచమ్మా’ టైమ్ నుంచి తెలుసు. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఒకరికొకరికి తెలుసు కనుక చాలా మంచి సంగీతం ఇచ్చారు. నటుడిగా ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్లో నటించాను. త్వరలోనే స్ట్రీమ్ అవనుంది. నటుడిగా తృప్తినిచ్ఛే పాత్రలు చేస్తూ.. ఎక్కువగా రైటింగ్, డైరెక్షన్పై దృష్టి పెట్టాలి అనుకుంటున్నా’’.