మార్చి 1 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

మార్చి 1 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో మార్చి ఒకటో తేదీ నుంచి11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ డి.పెద్దిరాజు చెప్పారు. ఆ టైంలో 11 రోజులపాటు అన్ని ఆర్జిత సేవలను నిలిపివేస్తునట్లు స్పష్టం చేశారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుంచి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్ట వేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. 5న సాయంత్రం 7:30 నుంచి 11వ తేదీ వరకు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి టికెట్లు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచామని చెప్పారు.