శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలుపుదల

శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు నిలుపుదల

శ్రీశైలంలో ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు గర్భాలయ స్పర్శ దర్శనాలు(సర్వ దర్శనం కాదు) నిలుపుదల చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల అభిషేకాలు,కుంకుమార్చనలతో పాటు గర్భాలయ స్పర్శ దర్శనాలు మూడు రోజులపాటు తాత్కాలికంగా నిలుపుదల చేయనున్నామన్నారు. ఈనెల 31 న శనివారం, జనవరి 1 నూతన సంవత్సరం, 2వ తేదీన ముక్కోటి ఏకాదశి కూడా రావడంతో భక్తులు శ్రీశైలానికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఆ మూడు రోజులు భక్తులందరికి స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామని అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉత్తరద్వారం నుంచి భక్తులు దర్శనాలు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామి అమ్మవార్లకు రావణ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని.. ఆరోజున సాయంత్రం కన్నుల పండుగగా గ్రామోత్సవం నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.