
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 'RRR'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ వీడియో గేమ్ లోకి జక్కన్న అడుగుపెట్టాడు. ప్రముఖ జపాన్ గేమ్ డెవలపర్ హిడియో కొకమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'డెత్ స్టాండింగ్ 2: ఆన్ ది బీచ్ వీడియో గేమ్లో జక్కన్న అతడి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ క్యామియో రోల్ పోషించినట్లు సమాచారం.
#DeathStranding2 video game featuring SSR! 👍
— idlebrain jeevi (@idlebrainjeevi) June 24, 2025
pic.twitter.com/HsdS4wZh0N
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ప్రధాన పాత్రల్లో నార్మన్ రీడస్, ఎల్లీ పానింగ్, లియా సెడౌక్స్ లాంటి ప్రముఖ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఈ గేమ్కు ముందుగానే యాక్సెస్ పొందిన కొందరు ప్లేయర్లు, గేమ్లో రాజమౌళిని "ది అడ్వెంచరర్'గా, కార్తికేయను 'అడ్వెంచరర్ 'స్ సన్గా గుర్తించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అభిమానులందరూ రాజమౌళిని 'గ్లోబల్ ఐకాన్' అని పిలుస్తున్నారు.
■━━━━━□
— 新潮文庫nex (@shinchobunkonex) June 25, 2025
┃ 本日発売 ┃
□━━━━━■
ゲームとほぼ同時の発売で話題沸騰!
「DEATH STRANDING 2: ON THE BEACH」を完全ノベライズした
『デス・ストランディング2 オン・ザ・ビーチ』が
本日いよいよ発売です!
サムの新たな旅をゲームと小説、両方で楽しみましょう! pic.twitter.com/0MhE9LtEdF
ఇదిలా ఉంటే.. జపాన్లో తెలుగు సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. 'RRR'సినిమాను అక్కడ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు జక్కన్న. ఆ దేశంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ కూడా అందుకుంది.
మరోవైపు ప్రస్తుతం రాజమౌళి SSMB29సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకుంది. తాజాగా వీటిలో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో మహేశ్, ప్రియాంక, పృథ్వీరాజ్తో పాటు దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్ట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది.