Rajamouli SSMB29: మహేష్ బాబు సినిమా కోసం..రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోట్లేదట!

Rajamouli SSMB29: మహేష్ బాబు సినిమా కోసం..రాజమౌళి ఒక్క రూపాయి కూడా తీసుకోట్లేదట!

టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli). టాలీవుడ్ లో కలల రాజకుమారుడిగా..మోస్ట్ స్టైలిష్ హీరోగా మహేష్ బాబు (Mahesh Babu) తనదైన మూవీస్ తో ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తోందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి..ఫ్యాన్స్ అప్డేట్స్ విషయంలో ఆగలేకపోతున్నారు

ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శకదీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టు గురుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా నేషనల్ వైడ్ ట్రేండింగ్ గా మారుతోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాను (SSMB29) రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌ తో తెరకెక్కిస్తుండంగా..రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ పై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.    

రాజమౌళి ఈ సినిమాకి తన పారితోషికంగా ఒక్క రూపాయి కూడా తీసుకోట్లేదని సమాచారం.కానీ, దానికి బదులుగా జక్కన్న వేరొక విధానాన్ని ఎంచుకున్నాడట. అయితే..రాజమౌళికి మాత్రం ఈ సినిమాలో నటించే ప్రధాన నటీనటుల పారితోషికం కంటే ఎక్కువగానే రాబట్టుకునేలా ప్లాన్ చేశాడట. అదేంటంటే..రాజమౌళి తన రెమ్యునరేషన్ తో కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయబోతున్నాడనే విషయం అర్ధం అవుతోంది. 

మరి మహేష్ బాబు మాత్రం ఈ సినిమాకు గానూ..రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఏకంగా రూ.110 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోస్ లో మహేష్ బాబు ఒకరు. అందుకు ప్రొడ్యూసర్స్ కూడా మహేష్ అడిగినంత ఇవ్వడానికి ఎప్పుడు వెనుకాడరు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ నటించనుందని తెలుస్తోంది.