ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మరిపెడ/ తొర్రూరు/ బచ్చన్నపేట, వెలుగు: ఉమ్మడి వరంగల్ ​జిల్లాలో అధికారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గురువారం మరిపెడ మండలం వీరారం, తొర్రూరు మండలం ఫత్తేపురం, బచ్చన్నపేట మండంలంలోని బచ్చన్నపేట, నారాయణపూర్, పోచన్నపేట, సాల్వాపూర్, గంగాపూర్, కేశిరెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.