ఢిల్లీలో అమిత్ షాను కలిసిన రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు

ఢిల్లీలో అమిత్ షాను కలిసిన  రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు

వరికొనుగోళ్లపై టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టాలని రాష్ట్ర బీజేపీ నాయకులకు సూచించారు కేంద్రహోంమంత్రి అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు రాష్ట్ర బీజేపీ నాయకులు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం.. వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర నేతలతో చర్చించారు అమిత్ షా. హుజురాబాద్ లో గెలిచిన తర్వాత ఈటల తొలిసారిగా అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసిన వారిలో.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు.. బీజేపీ ఎంపీలు.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఈ సందర్భంగా.. ధాన్యం విషయంలో టీఆర్ఎస్ వైఖరిని బహిర్గతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. కేసీఆర్ అవినీతిని బహిర్గతం చేయాలన్నారు. ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్ చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీకి రెడీగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తల కోసం

విద్యార్థుల కోసమే ఏడేళ్ల సర్వీసు త్యాగం చేశా

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ

స్కూలు వాట్సాప్​ గ్రూపులో.. పోర్న్​ వీడియో