చైనాతో పోటీపడి  మొక్కలు పెంచుతున్నం: రాష్ట్ర ఫుడ్స్ ​చైర్మన్ ​మేడె రాజీవ్​సాగర్​

చైనాతో పోటీపడి  మొక్కలు పెంచుతున్నం: రాష్ట్ర ఫుడ్స్ ​చైర్మన్ ​మేడె రాజీవ్​సాగర్​

హైదరాబాద్, వెలుగు : చైనా, బ్రెజిల్​దేశాలతో పోటీపడి రాష్ట్రంలో మొక్కలు పెంచుతున్నామని తెలంగాణ ఫుడ్స్​చైర్మన్​మేడె రాజీవ్​సాగర్ అన్నారు. గడిచిన కొన్నేండ్లల్లో చైనాలో 500 కోట్ల మొక్కలు, బ్రెజిల్​లో 300 కోట్ల మొక్కలు నాటితే మన రాష్ట్రంలో 250 కోట్ల మొక్కలు నాటామని చెప్పారు. దశబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం నాచారంలోని తెలంగాణ ఫుడ్స్​ఫ్యాక్టరీలో హరితోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజీవ్​సాగర్ హాజరై మొక్కలు నాటారు. ఫారెస్ట్​సర్వే ఆఫ్​ఇండియా నివేదికల ప్రకారం.. రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరిగిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో పోలింగ్​హౌసింగ్​ కార్పొరేషన్​ చైర్మన్​ కోలేటి దామోదర్​గుప్త తదితరులు పాల్గొన్నారు.