హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. పబ్లిక్ గార్డెన్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా సీఎం హాజరయ్యే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ఉదయం 8.45 గంటలకు గన్ పార్కు లోని అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం కేసీఆర్.
- ఉదయం 8.57 గంటలకు పబ్లిక్ గార్డెన్ వద్ద డీజీపీ నుండి సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరిస్తారు.
- ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ...
- ఉదయం 9.05 నిమిషాలకు సీఎం కేసీఆర్ స్పీచ్ ప్రారంభం. సుమారు 45 నిమిషాల పాటు సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం
- సాయంత్రం 5 గంటలకు హైకోర్టులో జరిగే కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసిఆర్ పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి