ఆయిల్పామ్ సాగుతో లాభాలు : స్టేట్ హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా

ఆయిల్పామ్ సాగుతో లాభాలు : స్టేట్ హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా

నిజామాబాద్​, వెలుగు:  ఆయిల్​పామ్ సాగుతో లాభాలు ఆర్జించాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్​ యాస్మిన్ బాషా రైతులకు సూచించారు. గురువారం కలెక్టరేట్​లో ఆయిల్​పామ్​ సాగు చేస్తున్న రైతులకు ప్రీ యునిక్​ కంపెనీతో చేసిన బైబ్యాక్​ అగ్రిమెంట్ పేపర్స్​ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5,600 ఎకరాల్లో ఆయిల్​పామ్ సాగు ఉండగా, ఈఏడాది 1,500​ ఎకరాల్లో పంట కోతకు వచ్చిందన్నారు. 

దిగుబడి ఎక్కడ అమ్మాలనే దిగులు రైతుల్లో లేకుండా కంపెనీతో అగ్రీమెంట్ చేయిస్తామన్నారు. గవర్నమెంట్ సబ్సిడీతో పాటు ఇతర అన్ని రకాల తోడ్పాటు అందిస్తుందన్నారు. కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.