రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది: భట్టి

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది: భట్టి

రాష్ట్రం సమస్యల వలయంగా మారిందన్నారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. డెంగీ జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల పట్ల మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో అవినీతితో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. కాంగ్రెస్ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు తప్ప కొత్తవి లేవన్నారు. రెవెన్యూ చట్టంలో మార్పులు అవసరం లేదన్నారు భట్టి.