
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కిసాన్ మేళా ఏర్పాట్లను డీఏవో రాధిక బుధవారం పరిశీలించారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, స్టాళ్లను ప్రారంభిస్తారని తెలిపారు. హార్టికల్చర్ జేడీ సువర్ణ, వెటర్నరీ జేడీ కొండల్ రెడ్డి, హుస్నాబాద్ ఏడీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు...
కిసాన్ మేళాకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. బుధవారం సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్ ఉన్నారు.