
మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన గ్లైపోసెట్ గడ్డిమందును అక్రమంగా రవాణా చేస్తూ క్యాష్ చేసుకుంటున్న ఐదుగురిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. ₹85 లక్షల విలువైన 16 వేల లీటర్ల గ్లైపోసెట్ ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మంచిర్యాలలో పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ కేసు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మైలారం గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి గ్లైపోసెట్ను అమ్ముతున్నాడన్న సమాచారంతో.. టాస్క్ఫోర్స్, అగ్రికల్చర్ అధికారులు స్థానిక పోలీసులతో సోదాలు చేసి 250 లీటర్ల గ్లైపోసెట్ పట్టుకున్నారు. ఆసిఫాబాద్కు చెందిన సంతోశ్తనకు సప్లై చేస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో అక్కడా తనిఖీలు చేసి 1,200 లీటర్ల గ్లైపోసెట్ సీజ్ చేశారు. వీళ్లకు మంచిర్యాల జిల్లా వాసి బొల్లం మహేశ్.. శ్రీనివాస ఫర్టిలైజర్స్పేరిట కొన్ని నెలలుగా తక్కువ ధరకు గ్లైపోసెట్ రహస్యంగా అమ్ముతున్నట్లు తేలింది. మహేశ్ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు అతడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్లోని ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ (ఐఐఎల్) కంపెనీతో సోదాలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన14,390 లీటర్ల గ్లైపోసెట్ను స్వాధీనం చేసుకున్నారు. ఐఐఎల్కంపెనీ మేనేజర్ ఆకుల రమేశ్ తో సహా ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.