
- స్కూళ్లకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు సంబంధించిన మార్కులను వెంటనే ఐఎస్ఎంఎస్ పోర్టల్(schooledu.telangana.gov.in)లో అప్లోడ్ చేయాల్సిందిగా స్కూళ్లను సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన కరికులర్, కో కరికులర్ సబ్జెక్టుల మార్కులను ఇంకా చాలా స్కూళ్లు అప్లోడ్ చేయలేదని శనివారం పీడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మెటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు పూర్తయిన వెంటనే వాటి మార్కులతో పాటు కరికులర్, కో కరికులర్ మార్కులనూ సైట్లో అప్లోడ్ చేయాలని డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించారు.
కాగా, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్లకు ఇప్పటికే19,800 ట్యాబ్లను ఇవ్వగా.. వాటికి తాజాగా జియో నెట్వర్క్ సిమ్లను అందజేస్తున్నట్టు పీడీ తెలిపారు. టీచర్లందరికీ సిమ్ కార్డులందేలా డీఈవోలు, ఈవోలు, డీపీవోలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేలోపు సిమ్లు వేసి ట్యాబ్లను యాక్టివేట్ చేయాలని సూచించారు.