
- 8% అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలి
- పీఆర్సీ చైర్మన్కు స్టేట్ సెక్రటేరియెట్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, వెలుగు : ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా రికమండ్ చేయాలని.. సెక్రటేరియెట్ఉద్యోగస్తుల పే స్కేల్ పెంచాలని పే రివిజన్కమిషన్ను తెలంగాణ స్టేట్ సెక్రటేరియెట్ అసోసియేషన్(టీఎస్ఎస్ఏ) ప్రతినిధులు కోరారు. బీఆర్కే భవన్ లో శుక్రవారం పీఆర్సీ చైర్మన్ శివ శంకర్ను టీఎస్ఎస్ఏ ప్రెసిడెంట్సురేశ్ కుమార్, జనరల్ సెక్రటరీ దేవేందర్తో పాటు జాయింట్ సెక్రటరీ స్వామి ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పనిదినాలు వారానికి ఆరు రోజుల నుంచి 5 రోజులకు తగ్గించాలన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని ఉద్యోగులకు 30 శాతం హెచ్ఆర్ఏ కల్పించాలన్నారు. గవర్నర్ సెక్రటేరియెట్ ఉద్యోగస్తులకు ఇస్తున్నట్లుగా సెక్రటేరియెట్ ఉద్యోగస్తులకు 8 శాతం అదనపు హెచ్ఆర్ఏ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో నగదు రహిత వైద్య సేవలను కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. మహిళా ఉద్యోగులకు, చైల్డ్ కేర్ లీవ్స్ను 90 రోజుల నుంచి 2 సంవత్సరాలకు పెంచేలా సిఫార్సు చేయాలన్నారు.
అసిస్టెంట్సెక్రటరీలకు వాహన సదుపాయం కల్పించాలని, ఎలక్ర్టిక్ వాహనాల కొనుగోలు కోసం వడ్డీ లేని కార్, బైక్ అడ్వాన్స్లు కల్పించాలని తెలిపారు. పేషీ ఉద్యోగులకు పేషీ అలవెన్స్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి కనీస వేతనాలను పెంచాలని టీఎస్ఎస్ఏని సెక్రటేరియెట్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.