పెద్దపల్లి డీఈవోను సస్పెండ్​ చేయాలి .. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా

పెద్దపల్లి డీఈవోను సస్పెండ్​ చేయాలి .. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఎదుట విద్యార్థి, యువజన సంఘాల ధర్నా

పెద్దపల్లి, వెలుగు: అవినీతికి పాల్పడుతున్న పెద్దపల్లి డీఈవో మాధవిని సస్పెండ్​చేయాలని రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. రాష్ట్ర యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ నిధులు రూ.65 లక్షలు, టీచర్ ట్రైనింగ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ నిధుల్లో రూ.35 లక్షల దుర్వినియోగానికి డీఈవోనే కారణమని ఆరోపించారు.

 ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూళ్ల నుంచి వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. డీఈవో అక్రమాలపై గతంలో కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశామని, అయినా చర్యలు తీసుకోకపోవడం వల్లే ధర్నాకు దిగినట్లు జేఏసీ లీడర్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి, యువజన సంఘాల వేదిక లీడర్లు అమరగాని ప్రదీప్‌‌‌‌‌‌‌‌కుమార్, మధు, జనార్ధన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కృష్ణ, మహేందర్, కిరణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.