ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం

ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం

ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆదివారం పట్టణంలో ఆ పార్టీ నేతలు ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను ఏ పార్టీ గుర్తించకపోగా, అన్యాయం చేసిందన్నారు.

రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. మున్సిపల్  చైర్మన్  రాంపాల్ నాయక్, వైస్  చైర్మన్  దుర్గయ్య, కౌన్సిలర్లు కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, విజయకృష్ణ, లక్ష్మణ్, జ్యోతి నరసింహ, యాదమ్మ శ్రీశైలం యాదవ్,  లక్ష్మణరావు, ఆనంద్, శ్రీకాంత్ సింగ్  పాల్గొన్నారు.