నంద్యాల జిల్లాలోని వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందం ఆవుల కోసం గాలిస్తోంది. సుమారు 150 ఆవుల ఆచూకీ ఇంకా లభించలేదు. సహాయక చర్యలను జిల్లా పశుసంవర్ధక శాఖ డి.డి శారదమ్మ, జేడీ రమణయ్య పర్యవేక్షిస్తున్నారు. సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ జగన్ మోహన్ పుట్టిలో ప్రయాణించి పరిస్థితిని సమీక్షించారు.
కాగా వెలుగోడు జలాశయంలో 500 ఆవులు కొట్టుకుపోయాయి. ఆవులు మేత మేస్తుండగా అడవిపందులు వెంటపడడంతో నీటిలోకి పరుగులు తీశాయి. సుమారు 500 ఆవులు నీటిలో కొట్టుకుపోతుండగా 350 ఆవులను కాపరులు, మత్స్యకారుల సహాయంతో రక్షించారు. మిగతా 150 ఆవుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.