పేపర్లలో ఫుడ్ పెడుతున్నారా.. క్యాన్సర్ కచ్చితంగా వస్తుందంట..

పేపర్లలో ఫుడ్ పెడుతున్నారా.. క్యాన్సర్ కచ్చితంగా వస్తుందంట..

న్యూస్‌ పేపర్‌ ఆహార పదార్థాలకు వినియోగించే విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆహారలను ఫ్యాక్‌ చేయడానికి న్యూస్‌ పేపర్‌ను వినియోగించొద్దని వ్యాపారులను కోరింది. న్యూస్‌ పేపర్‌లో ప్యాక్‌ చేసిన ఆహారాలు, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచించింది.

ఎవరైనా ఇష్టంగా చేసే పని ఏదైనా ఉంది అంటే అది తినడం ఒక్కటే. ఇంట్లో వండుకునే తినడానికి బద్దకం ఎక్కువై ఈ మధ్య కాలంలో ఆన్లైన్‌లో ఆర్డర్ చేసుకొని తినడం సర్వసాధారణం అయిపోయింది. ఇది ఎంతవరకు ఆరోగ్యం అనే విషయాన్ని ఏమాత్రం ఆలోచించకుండా లాగించేస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు రోడ్ మీద ఏం కనిపించినా తినేయడం కూడా కామన్ అయిపోయింది. సాయంత్రం సమయాల్లో అయితే మిర్చీలు, ఖారా, పునుగులు, టిఫిన్స్ వంటి ఆయిల్ ఫుడ్ అస్సలు మిస్ అవ్వరు. వీటిని టిఫిన్ సెంటర్లలో న్యూస్ పేపర్లలో పెట్టి ఇవ్వడం మనం చూస్తుంటాం.

ALSO READ: Good Health : వాల్ నట్స్ ఎలా తినాలంటే..!

అయితే, దీంతో ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఫుడ్ ప్రొడక్ట్స్ ప్యాకేజింగ్‌లో న్యూస్ పేపర్లు, నాణ్యతలేని ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయాలంటూ ఫుడ్ ఇండస్ట్రీలకు నిర్దేశించింది. ప్రత్యేకించి నూనెలో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్‌ను తినేటప్పుడు న్యూస్ పేపర్లను వాడొద్దని హెచ్చరించింది. న్యూస్ పేపర్ మెటీరియల్ అనేది ఆయిల్ ఫుడ్స్‌లోని నూనెను పీల్చుకోవడం సంగతి అలా ఉంచితే.. అందులోని ప్రమాదకర పదార్థాలను ఆయిల్ ఫుడ్‌లోకి ఈజీగా పంపిస్తుందని తెలిపింది. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయని ఫుడ్ గ్రేడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌నే వాడాలని ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలను కోరింది.

ఏదైనా ఆహార పదార్థాలను కొనేటప్పుడు ప్యాకేజింగ్ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలకు సూచించింది. న్యూస్ పేపర్లలో ఉపయోగించే సిరాలోని సీసం, భార లోహాలు.. అందులో ప్యాక్ చేసిన ఫుడ్‌లోకి ఇంకిపోయి, మనిషి తిన్నాక ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపించడం మొదలుపెడతాయని హెచ్చరించింది. వార్తా పత్రికల పంపిణీ ప్రక్రియ అనేక విధాలుగా జరుగుతుంటుందని.. ఈ క్రమంలో ఏదైనా ఒక దశలో వాటిలోకి వైరస్‌లు, బ్యాక్టీరియాలు చేరే ముప్పు ఉంటుందని పేర్కొంది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ప్యాకేజింగ్) రెగ్యులేషన్స్- 2018’ ప్రకారం ఆహారాన్ని నిల్వ చేయడానికి, ప్యాక్ చేయడానికి న్యూస్ పేపర్లను వినియోగించడంపై బ్యాన్ ఉన్న విషయాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తు చేసింది

  • న్యూస్ పేపర్లకు వాడే ఇంక్ నోట్లోకి వెళ్తే చాలాప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు వెల్లడించినట్లు FSSAI తెలిపింది.  ప్రింటింగ్ రంగు, ఇంక్, పిగ్నెంట్ లు కలిసే ప్రదేశంలో ఆహారం కలుషితమై  క్యాన్సర్ వ్యాధితో పలు రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. 
     
  • వార్తాపత్రికలను ప్రింటింగ్ చేసేందుకు వాడే ఇంక్  పెట్రోలియం లాంటి విష పూరితమైన సేంద్రీయ పదార్దాలను కలిపి తయారు చేస్తారు. మనము తినే ఆహారానికి ఇవి అంటుకుంటే చాలా ప్రమాదకరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. 
     
  • న్యూస్ పేపర్ ప్రింటింగ్ కు వాడే ఇంక్ లో కాడ్మియం వంటి లోహాలతో ప్రమాదకరమైన రసాయన సమ్మేళనాలతో  కలిపి తయారు చేస్తున్నారు. న్యూస్ పేపర్ పై తినే వస్తువులు పెడితే .... వాటిని తినేటప్పుడు ప్రమాదకర రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన ఆరోగ్యసమస్యలను కలిగిస్తాయి. 
     
  • వార్తాపత్రికల బండిల్స్.. ఇంటింటికీ వేసేటప్పుడు  కొన్ని బ్యాక్టీరియాలు చేరి కలుషితమయ్యే అవకాశం ఉంది.  న్యూస్ పేపర్ పై కనపడకుండా బ్యాక్టీరియా, శిలీంధ్రాలు,ఇతర సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి, ఇవి ఆహారాన్ని కలుషితం చేస్తాయి