సినిమా ఆపడమనేది బ్యాడ్ థింగ్

సినిమా ఆపడమనేది బ్యాడ్ థింగ్

సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్.. ఇదొక ఆనవాయితీగా మారుతోందని సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్కీ సినిమాపై కోర్టును తప్పుదారి పట్టించి శేఖర్ రాజు అనే వ్యక్తి స్టే తీసుకున్నాడన్న ఆయన...  తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో కేసు వేశారని ఆరోపించారు. దానికి సంబందించిన ఆధారాలు  పంజాగుట్ట పోలీసులకు అందించానని తెలిపారు. అతను స్టే తేవడంతో సినిమా ఆగిపోయిందని.. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు తనపై ఆలిగేషన్ పెట్టారన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఆపడమనేది చాలా చెడ్డ విషయమని.. ఇది మరోసారి పునరావృతమవకూడదని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టానని తెలిపారు. ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది, వారందరూ శేఖర్ రాజుపై కేసులు పెడతారని ఆర్జీవీ చెప్పారు. ఈ విషయంపై చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నామన్న రామ్ గోపాల్ వర్మ.. వాళ్ల అంతు చూస్తానని కోపం వ్యక్తం చేశారు. కాగా ఆర్జీవీ నిర్మి్ంచిన లడ్కీ సినిమా ఈ నెల 15 రిలీజ్ అయిన విషయం తెలిసిందే.