శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు

శంషాబాద్. వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్ట్​లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు మెయిల్​ ద్వారా హెచ్చరించాడు. దీంతో పోలీస్ ఇంటిలిజెన్స్, ఎయిర్​పోర్ట్​ అధికారులు అప్రమత్తమై విమానాశ్రమంలో అనువణువూ తనిఖీలు చేశారు. ఎక్కడా  బాంబు ఆనవాళ్లు లభించకపోవడంతో తప్పుడు సమాచారం అందినట్లుగా గుర్తించారు. బెదిరింపు మెయిల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో  పోలీసులు నిమగ్నమయ్యారు.