
- జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి అమృత
పిట్లం, వెలుగు: యూత్ కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జి అమృత అన్నారు. ఆదివారం పిట్లంలో జుక్కల్ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జి ఇమ్రోస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జి అమృత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ కృషి చేయాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కోరారు. జిల్లా యువజన కాంగ్రెస్అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు.