ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ విక్రాంత్సింగ్ కుమార్

ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు : ఏఎస్పీ విక్రాంత్సింగ్ కుమార్

భద్రాచలం, వెలుగు: ప్రజలకు ఇబ్బంది కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్​సింగ్ కుమార్ హెచ్చరించారు. భద్రాచలం పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలైన కొంతమంది యువత సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. గంజాయి సమాచారం తలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతున్న యువకులను ఆపి, కౌన్సెలింగ్​చేశారు.