
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ సుధీర్, డీపీవో జయసుధతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 594 గ్రామపంచాయతీలకు 5,058 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 జడ్పీటీసీ, 227 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.
జిల్లాలో 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 4 రిసెప్షన్ సెంటర్లు, 3 స్ట్రాంగ్ రూములు, 3 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 12 జిల్లా నోడల్ అధికారులు, 105 మంది జోనల్ స్థాయి అధికారులు, 45 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 59 సిట్టింగ్ స్క్వాడ్ టీంలు, 20 ఎంసీసీ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి పాల్గొన్నారు. అలాగే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకకు ఎన్నికల విధులపై ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు