న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాలు సహా బీహార్లోనూ భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, నేపాల్లో శుక్రవారం రాత్రి 11.32 గంటలకు రిక్టర్ స్కేల్పై 6.4 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం కారణంగానే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ట్విట్టర్లో వెల్లడించింది. ఈ భూకంపం వల్ల నేపాల్లో 70 మంది చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని సంతాపం తెలిపారు.