కోచింగ్​కు పైసలు ఇవ్వలేదని యువకుడి సూసైడ్​

కోచింగ్​కు పైసలు ఇవ్వలేదని యువకుడి సూసైడ్​

కరీంనగర్​ రూరల్, వెలుగు: గ్రూప్స్​ కోచింగ్ ​కోసం పేరెంట్స్​డబ్బులు ఇవ్వడం లేదని కరీంనగర్​ రూరల్​మండలం తీగలగుట్టపల్లికి చెందిన పులి మధుకర్(28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీగలగుట్టపల్లి చంద్రపురి కాలనీకి చెందిన పులి తిరుపతిగౌడ్ ​కొడుకు మధుకర్ ​బీటెక్​పూర్తయినప్పటి నుంచి గ్రూప్స్​కు ప్రిపేర్ ​అవుతున్నాడు. గతంలో ప్రిలిమ్స్​ క్వాలిఫై అయినా మెయిన్స్​లో పోయింది. తిరిగి ప్రిపేర్​కావడానికి కోచింగ్​కోసం రెండు రోజుల క్రితం రూ.25 వేలు పేరెంట్స్​దగ్గర తీసుకున్నాడు. మరో రూ. 25 వేలు కావాలని గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అడుగగా ఇంటి పని నడుస్తోందని, తర్వాత చూస్తానని తండ్రి చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి వచ్చి పురుగుల మందు తాగానని తండ్రికి చెప్పడంతో స్థానికుల సహాయంతో కరీంనగర్​ గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.