టీచర్ సిగరెట్ తాగొద్దన్నదని ఉరేసుకున్న విద్యార్థి

టీచర్ సిగరెట్ తాగొద్దన్నదని ఉరేసుకున్న విద్యార్థి

అచ్చంపేట, వెలుగు : నాగర్‌‌ కర్నూల్‌ జిల్లా బల్మూర్ ​మండలం పోలిశెట్టిపల్లి పరిధిలోని ఓ  ప్రైవేటు స్కూల్​లో సిగరెట్ ​తాగాడని టీచర్లు మందలించడంతో మనస్తాపం చెందిన స్టూడెంట్​స్కూల్​ వెనుక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్రాబాద్​ మండలం మాదవానిపల్లికి చెందిన నర్సింహ, మణెమ్మల చిన్న కొడుకు మాదాని ఆకాశ్​(16) అచ్చంపేట శివారులోని జేఎంజేహెచ్ ​స్కూల్​లో ఎస్సెస్సీ చదువుతున్నాడు. తండ్రి నర్సింహ చిన్నప్పుడే చనిపోగా, తల్లి కూలి పని చేసి ఆకాశ్​ను చదివిస్తోంది. సోమవారం ఆకాశ్​ సిగరెట్ తాగాడని తెలియడంతో టీచర్లు మందలించారు. ఈ విషయాన్ని తల్లి మణెమ్మకు ఫోన్​ చేసి చెప్పగా ఆమె కూడా తిట్టింది. మంగళవారం ఉద యం క్లాస్​కు వచ్చిన ఆకాశ్​ ఇంటర్​ వెల్​ బెల్ కాగానే స్కూల్ ​వెనుక ఉన్న మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఆకాశ్ ​క్లాస్​లో కనిపించకపోవడంతో చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. స్కూల్ ​మేనేజ్​మెంట్​ వేధింపులతోనే ఆకాశ్​ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు స్కూల్​ ముందున్న శ్రీశైలం -–నాగర్ కర్నూల్​ మెయిన్​రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో పాల్గొన్న బీజేవైఎం లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు.