మేడ్చల్ స్కూల్ లో కరోనా కలకలం

మేడ్చల్ స్కూల్ లో కరోనా కలకలం

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి డిఆర్ఎస్ ఇంటర్ నేషనల్ స్కూల్ లో కరోనా కలకలం రేపింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న క్రమంలో ఓ విద్యార్థికి పాజిటివ్ రావడం స్కూల్ సిబ్బంది ఉలిక్కిపడేలా చేసింది. డిఆర్ఎస్ స్కూల్ లో ఓ విద్యార్థి ఇటీవలే ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు. ఆ తర్వాత అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది.  విషయం తెలిసిన వెంటనే స్కూల్ యాజమాన్యం సదరు విద్యార్థితో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్న 14మందిని స్టూడెంట్స్ ను ఐసోలేషన్ లో ఉంచాలని వారి తల్లిదండ్రులకు సూచించింది. డీఎంహెచ్ఓతో పాటు వైద్య సిబ్బంది స్కూల్ ను సందర్శించి క్లాస్ రూంలను శానిటైజ్ చేయించారు. కరోనా కేసు నమోదవడంతో యాజమాన్యం స్కూల్ కు సెలవులు ప్రకటించింది. స్టూడెంట్స్ అందరినీ ఇళ్లలో ఐసోలేషన్ లో ఉంచి ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా చూడాలని పేరెంట్స్ కు సూచించింది.

For more news : 

జవాన్ సోదరి పెళ్లి.. అన్న లేని లోటు తీర్చిన ఆర్మీ

ఏపీలో ఘోర ప్రమాదం.. వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు..