నందిపేట, వెలుగు : ఓ స్టూడెంట్ను అకారణంగా ముగ్గురు టీచర్లు ఒకరి తర్వాత ఒకరు చితకబాదడంతో అతడి కర్ణభేరి పగిలి దవాఖానా పాలయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు ఔట్సోర్సింగ్ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. బాధితుడి కథనం ప్రకారం..నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని నూత్పల్లి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల స్కూల్లో ఈ నెల 7వ తేదీ నుంచి అంతర్జిల్లా పాఠశాలల క్రీడలు జరుగుతున్నాయి. శుక్రవారం ముగింపు కాగా, ఆటలాడడానికి వచ్చిన వేరే స్కూల్ స్టూడెంట్ ఒకరు సీసీ కెమెరాను పాడు చేస్తున్నాడు. దీన్ని నూత్పల్లి స్కూల్లో ఎస్సెస్సీ చదువుతున్న రుషేందర్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే పీఈటీ శ్రీకాంత్అ క్కడికి వచ్చి ‘ అతడెవరో కెమెరాను చెడగొడుతుంటే నువ్వు సైలెన్స్గా ఎందుకున్నావ్’ అంటూ రుషేందర్ను ఆఫీసు రూం కు తీసుకెళ్లి మెడ , చెవి పై కర్రతో కొట్టాడు. రుషేందర్ చెవి నుంచి రక్తం కారగా తుడుచుకున్నాడు.
కొద్దిసేపటికి ఇదే స్కూల్లో పని చేస్తున్నటీచర్లు నరేశ్, శంకర్ కూడా వచ్చి చేయి చేసుకోగా చెవి నుంచి మళ్లీ రక్తం కారింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లారు. ఘటన శుక్రవారం జరగ్గా శనివారం తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు టీచర్లపై కలెక్టర్ కు కంప్లయింట్ చేశారు. స్కూల్కు వచ్చినప్పుడల్లా తాము రూల్స్ మాట్లాడటం సహించలేకే తమ కొడుకును కొట్టారని ఆరోపించారు. స్కూల్ ఎదుట ఆందోళన చేయగా ఆర్సీఓ సత్య నారాయణ వచ్చి వారితో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన ఔట్సోర్సింగ్పీఈటీ శ్రీకాంత్, టీచర్ శంకర్లను సస్పెండ్చేశామని, రెగ్యులర్ టీచర్ నరేశ్పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరామని చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు.