మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్నం భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత

మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హనుమకొండ జిల్లాలో  కమలాపూర్ మండలంలో ఈ ఘటన జరిగింది.శ్రీరాముల పల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటూ 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మంది అనారోగ్యం బారిన పడ్డారు. శ్రీరాములపల్లె పాఠశాల నుండి 108 ద్వారా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.