- యూపీలో టీచర్ను వేధించిన స్టూడెంట్లు
- వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
మీరట్: ఉత్తరప్రదేశ్లోని ఓ స్కూల్లో మహిళా టీచర్ను కొందరు స్టూడెంట్స్ వేధింపులకు గురి చేశారు. టీచర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధనా ఇనాయత్పూర్ గ్రామంలోని స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న నలుగురు స్టూడెంట్లు వారికి పాఠాలు చెప్పే 27 ఏండ్ల మహిళా టీచర్ను లైంగికంగా వేధించారు. క్లాస్ రూమ్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్చేశారు. దీంతో ఆదివారం ఆ టీచర్పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నలుగురు స్టూడెంట్లు చాలాకాలంగా క్లాస్ రూంలోనే నన్నుఅసభ్యపదజాలంతో వేధిస్తున్నారు.
హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. జూన్ 24న స్కూల్ ఆవరణలో ‘ఐ లవ్యూ’ అంటూ వెంటపడుతూ.. వీడియోలు తీశారు. ఈ వీడియోతో పాటు క్లాస్రూంలో అసభ్యపదజాలంతో వేధించిన వీడియోను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి’ అని కంప్లెయింట్లో పేర్కొన్నారు. టీచర్ కంప్లెయింట్తో స్టూండెట్స్ను అదుపులోకి తీసుకొని జువెనైల్జస్టిస్బోర్డు ఎదుట హాజరు పరిచినట్టు కితౌర్ఎస్హెచ్వో అరవింద్మోహన్శర్మ తెలిపారు. ఆ స్టూడెంట్స్ వయసు సుమారు 16 సంవత్సరాలు ఉంటుందని ఆయన వెల్లడించారు.