విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోండి : ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ

 విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోండి : ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ
  • ల్యాబ్ ల నిర్వహణపై అసంతృప్తి

చండ్రుగొండ, వెలుగు : విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ల్యాబ్ లు ఎంతగానో ఉపయోగపడతాయని, శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెంచుకోవాలని భద్రాద్రికొత్తగూడెం ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తెలిపారు. శనివారం చండ్రుగొండ లోని జడ్పీహెచ్​ఎస్​ను సందర్శించారు.  స్కూల్ లోని అటల్ టింకరింగ్ ల్యాబ్, సాధారణ ప్రయోగశాలలను పరిశీలించి వాటి  నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.  

ల్యాబ్ లను సరిగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలు రాబట్టవచ్చని టీచర్ల కు సూచించారు.  టెన్త్ క్లాస్ రూంలోకి వెళ్లి స్టూడెంట్ల ప్రతిభను  పరీక్షించారు. అనంతరం స్కూల్ ఆవరణ లో మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సైదులు, నాగరాజు, సీఆర్పీ సేవ్యా, టీచర్లు ఉన్నారు.