పీయూలో సమస్యలు తీర్చాలని స్టూడెంట్ల ధర్నా

పీయూలో సమస్యలు తీర్చాలని స్టూడెంట్ల ధర్నా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ(పీయూ)లోని హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు ధర్నాకు దిగారు. శుక్రవారం వర్సిటీ మెయిన్​గేట్​కు తాళం వేసి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. సాయంత్రం 6 గంటల దాకా బైఠాయించారు. సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదన్నారు. హాస్టళ్లలో నీళ్ల సౌలత్​లు లేవని, రూమ్​లలో లైట్లు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని  చెప్పారు. మెస్​లో భోజనం సరిగా పెట్టట్లేదని మండిపడ్డారు. రూమ్​లలో బెడ్లు లేక నేలపైనే పడుకోవాల్సి వస్తోందని, వర్షం పడితే నీళ్లు రూమ్​లలోకి చేరుతుండటంతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీసీ లక్ష్మికాంత్ రాథోడ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ధర్నాను విరమించారు.