పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్

నిజామాబాద్ జిల్లా బోధన్ లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. ఆరేళ్లుగా మున్సిపలిటీ పన్ను చెల్లించకపోవడంతో ఇవాళ కార్యాలయాన్ని సీజ్ చేశారు అధికారులు. మున్సిపాలిటీకి 26 లక్షల రూపాయల పన్ను కట్టాలన్నారు మున్సిపల్ కమిషనర్ రామలింగం. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఆఫీస్ సీజ్ చేశామన్నారు. మున్సిపాలిటీ పన్ను చెల్లించని వారిపై పట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

మరో సంచలన నిర్ణయం తీసుకున్న భగవంత్ మాన్