పుష్ప: ద రైజ్ అంటూ అల్లు అర్జున్ ఇమేజ్ని ప్యాన్ ఇండియా స్థాయిలో రైజ్ చేశాడు సుకుమార్. ఆ ఇమేజ్ని మరింత పెంచేలా ‘పుష్ప: ద రూల్’ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీ ఇప్పటికే సెట్స్కి వెళ్లాల్సి ఉన్నా.. స్ర్కిప్ట్లో కొన్ని మార్పుల వల్ల ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూఎస్లో ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సుకుమార్..బడ్జెట్ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండేలా చూసుకుంటున్నాడట. ఫస్ట్ పార్ట్ కంటే దీనికి భారీ బడ్జెట్ని కేటాయిస్తున్నారని, సుమారు రూ.400 కోట్లతో ‘పుష్ప2’ని రూపొందించనున్నారని ఇండస్ట్రీ టాక్. లొకేషన్స్తో పాటు పాటలు, ఫైట్స్ కూడా గ్రాండియర్గా ఉండేలా ప్లాన్స్ వేస్తున్నారట బన్నీ, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్.
అదేవిధంగా ఈ సినిమా గురించి కొన్ని క్రేజీ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. రష్మికతో పాటు మరో హీరోయిన్ని సెలెక్ట్ చేస్తున్నారని, ఆమె కూడా ఓ స్టార్ హీరోయినే అని ప్రచారం జరుగుతోంది. బన్నీ, రష్మికలు పెళ్లి చేసుకునే సీన్తో ‘పుష్ప: ద రైజ్’ ఎండ్ అయ్యింది. కాబట్టి సెకెండ్ పార్ట్లో హీరో హీరోయిన్ల మధ్య కెమెస్ట్రీ అంతగా వర్కవుటవ్వదనే ఉద్దేశంతో సెకెండ్ హీరోయిన్ని రంగంలోకి దింపబోతున్నారట. ఆ హీరోయిన్ సమంత అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఇక స్పెషల్ సాంగ్ కోసం కూడా ఓ ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆల్రెడీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టేశాడు. సినిమా కూడా అతి త్వరలో సెట్స్కి వెళ్లనుంది. అప్పటికల్లా వీటన్నింటిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.