పాక్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు నాగల్, ముకుంద్ నో

పాక్‌‌‌‌‌‌‌‌ వెళ్లేందుకు నాగల్, ముకుంద్ నో
  • దాయాదితో డేవిస్ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌ నుంచి విత్‌‌‌‌‌‌‌‌డ్రా

న్యూఢిల్లీ: ఇండియా టెన్నిస్ సింగిల్స్ టాప్ ప్లేయర్లు  సుమిత్ నాగల్, శశికుమార్ ముకుంద్ వచ్చే ఏడాది డేవిస్ కప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం పాకిస్తాన్ వెళ్లబోమని ఆలిండియా టెన్నిస్​అసోసియేషన్​ (ఐటా)కు తెలిపారు. ఇండియాతో వచ్చే ఫిబ్రవరిలో జరిగే  డేవిస్ కప్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ గ్రూప్‌‌‌‌‌‌‌‌1 ప్లేఆఫ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు పాక్‌‌‌‌‌‌‌‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు అందుబాటులో ఉండబోమని 141వ ర్యాంకర్ నాగల్, 477 ర్యాంకర్ ముకుంద్ స్పష్టం చేశారు.

ఇందుకు కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, ఈ పోరు తన గేమ్‌‌‌‌‌‌‌‌ స్టయిల్‌‌‌‌‌‌‌‌కు సూట్‌‌‌‌‌‌‌‌ అవ్వని గ్రాస్ కోర్టులో జరగనున్నందున నాగల్, వ్యక్తిగత కారణాలతో ముకుంద్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు టాప్ ప్లేయర్ల నిర్ణయంపై తమ తర్వాతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించాలని ఐటా నిర్ణయించింది. కాగా,  భద్రతా కారణాల వల్ల 2019లో ఇండియా– పాక్​ ఆసియా/ఓసియానియా గ్రూప్‌‌‌‌‌‌‌‌1 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు తరలించిన విధంగా వచ్చే ఏడాది జరిగే డేవిస్ పోరును తటస్థ  వేదికకు మార్చేలా ఐటా ప్రయత్నాలు చేస్తోంది.