- హాస్టల్స్, మెస్లు యథావిధిగా కొనసాగుతాయి : రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ
సికింద్రాబాద్, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీలో వేసవి సెలవులు రద్దయ్యాయి. సోమవారం ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్స్, మెస్లు యథావిధిగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేర్అవుతున్న విద్యార్థుల విజ్ఞప్తి మేరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
క్రిశాంక్పై ఓయూ పీఎస్లో కేసు
గత ఏడాది ఓయూ వేసవి సెలవులకు సంబం ధించి.. ఫేక్ సర్క్యూలర్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్పై ఓయూ అధికారులు వర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము జారీ చేసిన సర్క్యూలర్కు బదులు ఫేక్ సర్క్కూలర్ను తయారుచేసి సోషల్మీడియాలో పెట్టి వర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించేలా న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్న క్రిశాంక్పై చట్టపరంగా చర్యలు
తీసుకోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ శ్రీనివాస్రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ నకిలీదని.. దానిపై సర్క్కూలర్ నంబర్ కూడా పెన్నుతో రాసి ఉందని, తన సంతకాన్ని కూడా కాపీ చేశాడని ఆయన పేర్కొన్నారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు క్రిశాంక్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.