ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై సునీల్ బన్సల్ రివ్యూ

 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై సునీల్ బన్సల్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు అక్కడ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ సునీల్ బన్సల్ సూచించారు. ఆదివారం పార్టీ స్టేట్‌‌‌‌ ఆఫీసులో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై సునీల్ బన్సల్, బండి సంజయ్ నేతలతో రివ్యూ చేపట్టారు. రాష్ట్రంలో 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్లాన్స్ రూపోందించుకొని ముందుకెళ్లాలని సూచించారు. గత ఎన్నికల్లో రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌ నియోజకవర్గాల్లో టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గెలిచిందని, ఈసారి బీజేపీ ఎక్కువ సీట్లలో గెలవాలని చెప్పారు. ఈ సమావేశంలో డీకే అరుణ, గరికపాటి మోహన్ రావు, జితేందర్ రెడ్డి, చాడా సురేశ్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.