
ప్రముఖ టీవీ యాంకర్ వర్షిణిపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లోఫైర్ అవుతున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్లో వర్షిణి 3 సార్లు స్టేడియంకు వచ్చింది. ఆమె వచ్చిన ప్రతీసారి హైదరాబాద్ జట్టు ఓడిపోతోంది. దీంతో.. ఫ్యాన్స్ ఆమెపై కోపంతో ఊగిపోతున్నారు. సెంటిమెంట్స్ ఫాలో అయ్యే సన్ రైజర్స్ ఫ్యాన్స్.. వర్షిణి మరోసారి స్టేడియంలో కనిపిస్తే అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నారు.
మరికొందరైతే.. సన్రైజర్స్కు ఇప్పుడున్న దరిద్రం చాలు.. ఇక నువ్వు కూడా తొడయ్యాయవంటే.. ఆ జట్టు కోలుకోవడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే.. ఇంకా సన్రైజర్స్కు ప్లే ఆఫ్స్ అవకాశాలున్నాయి. నువ్వు వచ్చాయవంటే అవి కూడా పోవడం ఖాయంమనీ వేడుకుంటున్నారు. మే 7 రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ వర్షిణిపై ఈ ట్రోలింగ్ జరుగుతోంది. వర్షిణిని మళ్ళీ స్టేడియంకు వస్తే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతుంది కాబట్టి.. రావొద్దని ఫ్యాన్స్ ప్రాధేయపడుతున్నారు.
కాగా.. ఈ సీజన్లో హైదరాబాద్లో సన్ రైజర్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్లకు వర్షిణి స్టేడియానికి వెళ్లింది. ఏప్రిల్ 18న ముంబై ఇండియన్స్, ఏప్రిల్ 24న ఢిల్లీ క్యాపిటల్స్, మే 4న కేకేఆర్ మ్యాచ్. ఈ 3 మ్యాచ్ల్లో సన్రైజర్స్ ఓడిపోయింది. మరి నిజంగా వర్షిణి సెంటిమెంట్ సన్ రైజర్స్ టీంను వెంటాడుతోందా? ఈ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ పై వర్షిణి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.