దుబాయ్: ఐపీఎల్-13లో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది చెన్నై. కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రతీకార పోరులో సన్రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీ తేల్చుకోనుంది ధోనీసేన. ఛేజ్ మాస్టర్ ధోనీ.. టీమ్ బ్యాటింగ్ సమస్యలతో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ శుభారంభాలు ఇస్తున్నా.. మిడిలార్డర్ వైఫల్యం చెన్నైకి ప్రతికూలంగా మారింది.
చెన్నై కంటే కొద్దిగా మెరుగైన స్థితిలో ఉన్న హైదరాబాద్కు కూడా ఈ మ్యాచ్లో గెలవడం అత్యవసరం. రాజస్తాన్ చేతిలో చేజేతులా ఓడటంతో ఇప్పుడు ఒత్తిడిలో పడిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ మ్యాచ్పై దృష్టిపెట్టింది. బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్కు సమస్యల్లేవు. బెయిర్స్టో, వార్నర్, మనీశ్, విలియమ్సన్ మంచి ఫామ్లో ఉన్నారు. అయితే పేసర్ భువనేశ్వర్ లేకపోవడంతో బౌలింగ్లోనే హైదరాబాద్ సమస్యలు ఎదుర్కొంటున్నది. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో రన్స్ కట్టడి చేసే సరైన బౌలర్ లేడు. రషీద్ ఖాన్ మెరుస్తున్నా.. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ మరింత కుదురుకోవాల్సి ఉంది. ఆల్ ద బెస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్.
టీమ్స్:
A look at the Playing XI for #SRHvCSK #Dream11IPL pic.twitter.com/dqqBbmOsus
— IndianPremierLeague (@IPL) October 13, 2020