టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా ‘గణపథ్’. ‘ఎ హీరో ఈజ్ బోర్న్ అనేది క్యాప్షన్. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సూపర్ 30, క్వీన్ చిత్రాల దర్శకుడు వికాస్ భల్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే టీజర్తో ఆకట్టుకున్న టీమ్, తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ‘తప్పకుండా ఒకరోజు అమరుడైన యోధుడు జన్మిస్తాడు.
ఆ యోధుడు చచ్చేవాడు కాదు చంపేవాడు..’ అంటూ హీరో క్యారెక్టర్ను పరిచయం చేశారు. ‘తనకోసం పోరాడేవాడు హీరో కాదు.. తను నమ్ముకున్న వాళ్ల కోసం పోరాడేవాడే హీరో’ అంటూ యాక్షన్ సీన్స్తో ఇంప్రెస్ చేశాడు టైగర్ ష్రాఫ్. అలాగే కృతిసనన్ కూడా యాక్షన్ సీన్స్లో కనిపించింది. 2070 నేపథ్యంలో సాగే ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామా ఇది. వసు భగ్నాని, జాకీ భగ్నాని, వికాస్ భల్, దీప్షికా దేశ్ముఖ్ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల కానుంది.