టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

ఐపీఎల్ 2022 లీగ్ దశలో చెన్నై, రాజస్థాన్  చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మొదలు కానున్న ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 8 విజయాలు 5 ఓటములతో 16 పాయింట్లు సాధించిన రాజస్థాన్ 3వ ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో పనిలేకుండా రాజస్థాన్ ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో విజయమే లక్ష్యంగా సంజూ శాంసన్ టీమ్ బరిలోకి దిగబోతుంది. అటు 13 మ్యాచుల్లో 4 విజయాలు, 9 ఓటములతో 9వ స్తానంలో ఉంది చెన్నై. అయితే ఈ గేమ్ లో గెలిచినా, ఓడినా చెన్నైకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ ప్లేఆఫ్ చేరుకోని చెన్నై..విజయంతో టోర్నీని ముగించాలని చూస్తోంది. 

 

https://twitter.com/IPL/status/1527644200833253380

రాజస్థాన్ తుది జట్టు: బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, పడిక్కల్ , హెట్ మెయర్, రియాన్ పరాగ్  , ఆర్. అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్దకృష్ణ, చాహల్, మేక్ కే.

చెన్నై తుది జట్టు:రుతురాజ్ గైక్వాడ్, కాన్వె,  మొయిన్ అలీ , జగదీషన్, అంబటి రాయుడు, ధోని, మిచెల్ సాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమ్రజీత్ సింగ్, మతిషా పతిరణ, ముఖేష్ చౌదరి