సింగరేణి హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

సింగరేణి హాస్పిటల్లో  సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరం

గోదావరిఖని, వెలుగు : గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్​లో ఆదివారం హైదరాబాద్​ కేర్​ హాస్పిటల్​ సమన్వయంతో సూపర్​ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్జీ 1 ఏరియా జీఎం డి.లలిత్​ కుమార్​ ప్రారంభించి పరిశీలించారు. ఈ శిబిరంలో 400 మందికి పైగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ట్రీట్​మెంట్, మందులతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​ హాస్పిటల్​కు రిఫర్​చేశారు. 

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ..  స్థానికంగా ఉన్న వారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా అనారోగ్య సమస్యలకు ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకు కేర్​ హాస్పిటల్​ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్లు, డాక్టర్లు, యూనియన్​ లీడర్లు పాల్గొన్నారు.