పద్మాలయా స్టూడియోకి చేరుకున్న కృష్ణ పార్థివదేహం

 పద్మాలయా స్టూడియోకి చేరుకున్న కృష్ణ పార్థివదేహం

సూపర్ స్టార్ కృష్ణ  పార్థివదేహన్ని కుటుంబసభ్యులు నానక్రామ్గూడలోని ఆయన నివాసం నుంచి పద్మాలయా స్టూడియోకు తరలించారు. ఉదయం 11 గంటలకు  ఏపీ సీఎం జగన్...  కృష్ణ  భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు.  మధ్యాహ్నాం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం కృష్ణ  పార్థివదేహన్ని అక్కడే  ఉంచనున్నారు.- ఆ తరువాత అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానానికి ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

సాయంత్రం నాలుగు గంటలకు కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.  కార్డియాక్‌ అరెస్టుతో  కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరిన కృష్ణ... మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.