ట్రయల్ బ్లేజర్స్పై నోవాస్ విజయం

ట్రయల్ బ్లేజర్స్పై నోవాస్ విజయం

పుణె: విమెన్స్ టీ20 చాలెంజ్ టోర్నీలో సూపర్ నోవాస్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన తొలి మ్యాచ్ లో నోవాస్ 49 రన్స్ తో ట్రయల్ బ్లేజర్స్ ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన నోవాస్ 20 ఓవర్లలో 163 రన్స్ కు ఆలౌటై లీగ్ లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ (29 బాల్స్ లో 4 ఫోర్లతో 37), హర్లీన్ డియోల్ (19 బాల్స్ లో 5 ఫోర్లతో 35) రాణించారు. బ్లేజర్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ (3/29), సల్మా ఖాతున్ (2/30) ఆకట్టుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లో ఒక్క ఎక్స్ ట్రా రన్ రాకపోవడం గమనార్హం. ఛేజింగ్ లో   బ్లేజర్స్ ఓవర్లన్నీ ఆడి 114/9 స్కోరు చేసి ఓడింది. స్మృతి మంధాన (23 బాల్స్ లో 4 ఫోర్లతో 34) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. నోవాస్ బౌలర్లలో పూజా వస్త్రాకర్ (4/12)  బ్లేజర్స్‌‌ను దెబ్బకొట్టింది. ఆమెకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి సూపర్ నోవాస్, వెలాసిటీ జట్ల మధ్య రెండో మ్యాచ్‌‌ జరుగుతుంది.