
చంద్రయాన్ -3(Chandrayan-3) విజయంతో భారత్.. అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచ దేశాలన్నింటినీ తన వైపుకు తిప్పుకుంది. ఈ విజయంతో ప్రపంచ దేశాల అగ్రనేతలు, ప్రముఖులందరూ ఇస్రో సైంటిస్టుల ప్రతిభను కొనియాడుతున్నారు. ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందించారు. ఈ విజయం భారతీయలను గర్వపడేలా చేసింది అంటూ ట్వీట్ చేశాడు.
While superpowers like the US, Russia, and China watch in agast amazement, India stuns the world with this humongous achievement.
— Rajinikanth (@rajinikanth) August 23, 2023
For the first time ever, our nation stamps it’s proud identity by landing #Chandrayaan3 on the south pole of the moon!
My heartfelt congratulations…
అమెరికా, చైనా, రష్యా వంటి అగ్ర దేశాలు ఆశ్చర్యంతో చూస్తుండగా.. భారతదేశం ఈ భారీ విజయంతో కొత్త చరిత్రను సృష్టించింది. మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 ని ల్యాండ్ చేయడం ద్వారా ఇండియా గొప్ప గుర్తింపును అందుకుంది. ఈ సంధర్బంగా మన ఇస్రో శాస్త్రవేత్తల టీమ్ కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని, మన దేశాన్ని గర్వపడేలా చేశారు అంటూ ట్వీట్ చేశారు రజనీకాంత్. ప్రస్తుతం రజని చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.